విశ్వనాథ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన బండి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ సినీ దర్శక దిగ్గజం, కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, పద్మశ్రీ కె. విశ్వనాథ్ మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయ విలువలకు, సంగీతానికి పెద్దపీట వేస్తూ తెలుగు సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్ అని కొనియాడారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొన్నారు. భారతీయ సినిమా ఉన్నంత కాలం కె. విశ్వనాథ్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. కె. విశ్వనాధ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.