వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

తెలంగాణా జ్యోతి: వెబ్ న్యూస్/ వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఈనెల 10 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండడంతో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు,మూడు రోజులుగా యాదాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ ఉచిత బస్సుల్లో భక్తులు ప్రయాణించి కొండపైకి చేరుకుంటున్నారు. శనివారం భారీ సంఖ్యలో వాహనాలపై భక్తులురావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.