పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసు రెడ్ మసీదు మత గురువు హత్య కేసులో ముషారఫ్ దోషిగా ఉన్నాడు. ఈ కేసులు చుట్టముట్టడంతోనే దుబాయ్ కు పారిపోయాడు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం ముషారఫ్ ను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. అతను మార్చి 2016 నుండి దుబాయ్లో నివసిస్తున్నాడు. 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్నాడు.
నివేదికల ప్రకారం మాజీ సైనిక పాలకుడు అవయవాలు.. కణజాలాలలో అమిలాయిడ్ అనే అసాధారణ ప్రోటీన్ ఏర్పడటం వలన ఏర్పడిన అరుదైన వ్యాధి అమిలోయిడోసిస్తో బాధపడుతున్నాడు.
గత ఏడాది జూన్లో ముషారఫ్ అనారోగ్యం పాలయ్యారు. అమిలోయిడోసిస్ సమస్య కారణంగా అతను మూడు వారాల పాటు ఆసుపత్రిలో ఉన్నాడని అతని కుటుంబం పేర్కొంది.
పర్వేజ్ ముషారఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ మేరకు ఆయన మరణించారని ధృవీకరించారు. ట్వీట్ చేస్తూ.. “ముషారఫ్ అనారోగ్యం (అమిలోయిడోసిస్) కారణంగా గత 3 వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. రికవరీ సాధ్యం కావడం లేదు. అవయవాలు పనిచేయని క్లిష్ట దశలో ఆయన మరణించారు’ అని పేర్కొన్నారు. .