దళిత సంఘర్షణ సమితి మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా అరుణ జ్యోతి

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: దళిత సంఘర్షణ సమితి(డిఎస్ఎస్)మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా యు.అరుణ జ్యోతి నియమితులైనారు. ఈ మేరకు డిఎస్ఎస్ జాతీయ కో ఆర్డినేటర్ నల్ల రాదా కృష్ణ నియామక పత్రాన్ని అంద జేశారు. ఈ సందర్బంగా అరుణ జ్యోతి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి, వారి హక్కుల  కోసం పాటుపడుతానన్నారు.ముఖ్యంగా దళిత మహిళల్లో రాజకీయ చైతన్యం , దళితుల హక్కుల పరి రక్షణ కోసం కృషి చేస్తానన్నారు.తనపై గల నమ్మకం తో తనకు ఈ పదవిని అప్పగించినండులకు నల్ల రాధా కృష్ణకు, ఇందుకు సహకరించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంజలి ఖాదర్ కు అరుణ జ్యోతి కృతఙ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.