తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ గాంధీ భవన్ లో స్వర్గీయ మల్లు అనంత రాములు 33వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమంలో భారతీయ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జిడిఆర్, సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత పోకల కిరణ్ కుమార్, నేషనల్ అంబేద్కర్ సేన ప్రెసిడెంట్ మల్లు అనంత రాములు కుమారులు మల్లు శివరాం, పిసిసి సీనియర్ నాయకులు డాక్టర్ రవి బాబు, పీసీసీ కార్యదర్శి పాశం రాజేంద్ర యాదవ్, ఓబిసి సెల్ రాష్ట్ర నాయకులు నూనె కోటి, పిసిసి సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, నిరంజన్, సామాజిక సేవకురాలు చిత్ర శేఖర్, నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రేనయ్య, ఆశలత, సుజీ, వివిధ ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలుపుతూ ఘననివాళులర్పించారు.