కేసీఆర్ ప్రభుత్వంను అభినందించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎం ఐ ఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి,ముంతాజ్ ఖాన్ లను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటివెలుగు స్టాల్ ల వద్దకు ఆర్ధిక,వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా దగ్గర ఉండి తీసుకువచ్చి ఎమ్మెల్యేలకు కంటి పరీక్షలు చేయించారు.

ఈ సందర్భంగా కంటివెలుగు ప్రాముఖ్యతను వివరించిన మంత్రి. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందని ఎం ఐ ఎం శాసన సభ్యులు కితాబిచ్చారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ది కలిగించే అవకాశం ఉందని ఏం ఐ ఎం ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసన సభ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమంను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ ను, మంత్రి హరీష్ రావు, ప్రభుత్వంకు వారు అభినందలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.