వికలాంగ బాలుని కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎల్లంపేట స్టేజి తండా వద్ద వికలాంగుడు బాలు ఇంటికి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  గురువారం కలిశారు. నడవలేని, మాట్లాడలేని 21 ఏళ్ల వికలాంగుడు బాలు తల్లి సంరక్షణలో ఉన్నాడు. తండ్రి మరణించాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాలు తల్లి భూక్య తులసి. తనకు వితంతు పెన్షన్ కూడా రావడం లేదని గోడు వినిపించారు. తన తరపున కుటుంబానికి 10వేలు సాయం చేసిన రేవంత్ రెడ్డి కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం తరపున సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.