తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రగతి ఆదాయంలోనా? అప్పుల్లోనా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్ర రాబడులు 36 శాతమే.. 64 శాతం అప్పులు, కేంద్రం గ్రాంట్లేనన్నారు. ఏడాదిలో చేయాల్సిన అప్పులు.. 5 నెలల్లో చేయడమే అభివృద్ధా? అని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీ ఆదాయం జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువైతే మౌలిక వసతుల కల్పన ఎందుకు చేయడం లేదు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.