బంగారు తెలంగాణ ఏమో కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారంగ మారింది

-  బీజేపీ నేత జీవిత రాజశేఖర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/సిద్ధిపేట: జిల్లాలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరని బీజేపీ నేత జీవిత రాజశేఖర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ నేత పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోచమ్మ గుడి వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ…. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ను గెలిపిస్తే కంట్లో నీళ్ళు మాత్రమే మిగిలాయి కానీ పనులు జరగలేదని విమర్శించారు. బ్రతకడానికి బీజేపీ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు 6359119119 నెంబర్ కి మిస్‌డ్ కాల్ ఇవ్వాలని కోరారు. జిల్లాలోని కోమటి చెరువులో మిషన్ భగీరథ పథకం లో అవినీతి జరిగిందని బీజేపీ నేత ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా కాలేదు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు హరీష్ రావు అనుచరులకు మాత్రమే పంపిణీ చేయడంతోనే ఆటో డ్రైవర్ రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ధరణిలో అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కొనొకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు అనారోగ్యాలు వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. హరితహరం పేరుతో అక్రమాలు చేశారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అగ్రరాజ్యాంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని జీవిత రాజశేఖర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.