బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా ఏ పార్టీకి లేదు

- ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడే సత్తా, ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదని, బిజెపి భావజాలానికి ప్రజలు మనస్పూర్తిగా మద్దతు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు వేగంగా పెరుగుతోందని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్‌ అన్నారు. AIMIMతో కలిసి పనిచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలతోనూ ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

తాజాగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో స్థానిక సీపీఐ నేతలు పాల్గొనడం పొత్తుకు సంకేతాలన్నారు. దేశాన్ని అగ్రపథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒక్కటవుతున్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, మన దేశ సంస్కృతిని, సరిహద్దులను కాపాడే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఉందన్న విశ్వాసం ప్రజలకు ఉందని సుభాష్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.