శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్న తెలంగాణ ముఖ్యమంత్రికెసిఆర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో తెలంగాణ తిరుమలగా పేరొందిన తిరుమల శ్రీవారి దేవస్థానంలో ఈ నెల 26 నుండి వచ్చే నెల ౩వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు విచేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం ఉందని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.