కరెంట్ ఎప్పుడు వస్తుందో రైతులకు వారం ముందే సమాచారం ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఐనవోలులో 133KV సబ్ స్టేషన్ లో ట్రాన్స్ కో ఏఈ తోట ఐలయ్య ను గురువారం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై వివరాలు తెలుసుకుని  ఏసీడీ, ఎఫ్ సీ ఏ చార్జీలు వసూలు చేయకూడదని మినిట్స్ లో రాసి అధికారులకు చెప్పాలన్నారు. రైతులకు కరెంట్ ఎప్పుడొస్తుందో వారం ముందే షెడ్యూల్ ఇవ్వాలని, రాత్రిపూత కరెంటుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పగటిపూట కరెంటు ఇవ్వాలని కోరారు. రేవంత్ సూచలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్న ఏఈ ఆరిటీజన్ కార్మికుల సమస్యలను రేవంత్ దృష్టికి  ఉద్యోగి శ్రవణ్ తీసుకువెళ్లారు. కనీస వేతనాలు, కార్మికులను పర్మినెంట్ చేసేలా చూడాలని వినతి పత్రం సైతం సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.