ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ఆయన యాత్ర కొనసాగిస్తున్నారు.  ఇందులో భాగంగా ఉప్పర్ పల్లికి చెందిన సందీప్ అనే గొర్రెల కాపరిని కలిసి సమస్యలు తెలుసుకున్న రేవంత్ రెడ్డితో గొర్రెల యూనిట్లు ఇస్తామని డబ్బులు తీసుకుని గొర్రెల పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందీప్. రెండు యూనిట్ల కోసం 86 వేలు కట్టించుకుని ఇప్పటికీ గొర్రెలు పంపిణీ చేయలేదని ఆవేదన చెందారు. అదేవిదంగా పెరుమామిండ్ల గ్రామంలో రచ్చబండ వద్ద గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి. గ్రామంలో ఇళ్లు లేక, సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్న గ్రామస్తులు తెలిపారు. గుంతలమయంగా మారిన రోడ్లతో అవస్థలు పడుతున్నామని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.