హైదరాబాద్ శివారు నార్సింగీలో వివాహిత గ్యాంగ్ రేప్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు నార్సింగీలో రాబరీ గ్యాంగ్ రెచ్చిపోయింది. పీరం చెరువు లో వివాహితను దోపిడీ దొంగలు కిడ్నాప్ చేసి.. గ్యాంగ్ రేప్  చేశారు. ఆపై మెడలో ఉన్న రెండు తులాల బంగారం దోచుకున్నారు. పీరం చెరువు గ్రామం వద్ద ఇద్దరు దుండగులు వివాహితను కారులో కిడ్నాప్ చేశారు.దుండగులు బలవంతంగా వివాహితను కారులో ఎక్కించుకొని కిస్మత్ పూర్ వైపు తీసుకొని వెళ్లి.. నోరు తెరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన దుండగులు… తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. మత్తులో ఉండగా ఒకరి తరువాత ఒకరు గ్యాంగ్ రేప్ చేశారు. మహిళను చాలా సేపు కారులో తిప్పారు. రాత్రి సమయంలో మహిళను గండిపేట వద్ద వదిలి వెళ్లి పోయారు. వివాహిత మత్తు నుంచి కొలుకున్న తరువాత తన భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని లేవలేని స్థితిలో ఉన్న భార్యను ఇంటికి తీసుకొని వెళ్లాడు. తనపై జరిగిన ఘోరాన్ని ఆమె భర్తకు వివరించింది. దీంతో భర్త నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Leave A Reply

Your email address will not be published.