కొత్తరహా మందుపాతరను రూపొందించిన మావోయిస్టులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మావోయిస్టులు కొత్తరహా మందుపాతరను రూపొందించినట్లు ములుగు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ములుగు, చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలోని (venkatapur)వెంకటాపురం పామునూర్ అడవిలో బీర్ బాటిల్ లో ఐఐడి తో మందుపాతరను కూంబింగ్ చేస్తున్న ప్రత్యేక బలగాలు కనుగొన్నాయి.
సకాలంలో మందుపాతరను గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేశారు. కరెంట్ వైర్, బీర్ బాటిల్, బోల్ట్ లు, కాపర్ సీల్, గన్ పౌడర్,మొలలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు అగ్రనేతలు చంద్రన్న, దామోదర్, కనకాల రాజిరెడ్డి, మంగు, సుధాకర్ల పై వెంకటాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఏటూరు నాగారం ASP సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.
షాక్కు గురైన పోలీసులు(police)
అడవిలోకి కూంబింగ్ వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు ఈ కొత్త తరహా మందు పాతరను అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
బీరు బాటిల్ మందుపాతర పోలీసులను విస్మయ పర్చినట్లు సమాచారం. ఇతరులకు ఎలాంటి అనుమానం రాకుండా అమర్చేందుకు ఈ మందుపాతర అనుకూలంగా మావోలు రూపొందించినట్లు అంచనా వేస్తున్నారు.
సరిహద్దుల్లో (Border) కూంబింగ్ ముమ్మారం
చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతం నుండి మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ గ్రామాలలో ప్రవేశించారనే సమాచారంతో స్పెషల్ పార్టీ, సిఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారు అదే సమయంలో లోతట్టు అడవి ప్రాంతాలలో ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు అనుమానితులను ప్రశ్నిస్తూ అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
పోలీసుల ముకుమ్మడి కూంబింగుతో సరిహద్దు గ్రామాల్లోని గిరిజనులు( traibal s)తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రానున్నది వేసవి కావడంతో మావోయిస్టులు తగిన రక్షణ చర్య లు తీసుకునే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పై చేయి సాధించేందుకు తనిఖీలు, సమిష్టి (coombing)కూంబింగులు చేపట్టి ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నారు.