ముగ్గురు బాలికల మిస్సింగ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. ప్రమీల, స్వప్న, హాసినా అనే ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన ముగ్గురు బాలికలు.. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని బాలికల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. దీని కోసం ప్రత్యేక టీమ్‌లను పోలీసులు ఏర్పాటు చేశారు. తిరుమలగిరిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సురేష్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కూతురు తన స్నేహితులతో బర్త్ డే వేడుకలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిమళ, స్వప్న, హసీనా అనే ముగ్గురు బాలికలు కలిసి పుట్టినరోజు వేడుకలకు వెళ్లారు. అయితే ఇంటికి తిరిగి రాకపోవడంతో భయానికి గురైన తల్లిదండ్రులు.. బంధువుల ఇళ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలికల ఆచూకీ లభించలేదు. దీంతో బాలికల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.