ఏపీ సిఎం జగన్ పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరమ దుర్మార్గుడని... ఏపీ లో జరుగుతోన్న పరిణామాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పదికాలాలు ఉండాల్సిన వాడు .. తన రాజకీయానికి తనే ముగింపు పలుకుతున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్ళే కొట్టి, దాడులు చేసి.. పట్టాభి పై కేసులు పెట్టారన్నారు. కుటుంబంలో కూడా శత్రుశేషం ఉండకూడదని జగన్ భావించారని ఆయన తెలిపారు.పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి ని బయటవారు హత్య చేయలేరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ను ముసలివాడంటోన్న వైసీపీ… ఆయన పర్యటనలకు కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర చేస్తే జగన్ కు భయమెందుకని నిలదీశారు. పట్టాభి ఆరోగ్యం విషయంలో డాక్టర్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారన్నారు. ఏపీలో డాక్టర్లు తీరును ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ (కమ్యూనిస్టులకు శత్రుత్వం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సీపీఐ నేతలు మద్దతులో తప్పేముందని నారాయణ పేర్కొన్నారు.