వేసవిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యెక ఏర్పాట్లు

-   రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ దిశానిర్దేశం చేశారు. బస్టాండ్‌ల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లుకూలర్లుబెంచిలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లుసంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ నుంచి ఆర్‌ఎంలుడీఎంలుఉన్నతాధికారులతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనివారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిర్దేశించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే కాలం టీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమనిఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు. సంస్థ ఆర్థిక పుష్టికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులకు మెరుగైననాణ్యమైన సేవలను అందించడమే తమ ప్రధాన విధి అనే విషయం మరిచిపోవద్దని చెప్పారు.

సూచనలు ఇవే…

·         మార్చి నెలలో పెళ్లిళ్లుశుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయనిరద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు.

·         ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తున్నామన్నారు. 31-45 రోజుల ముందు రిజర్వేషన్‌ చేసుకుంటే 5 శాతం రాయితీ, 46-60 రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక రాయితీలను సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలని ప్రజలను కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్వినోద్ కుమార్సీపీఎం కృష్ణకాంత్‌సీటీఎం జీవనప్రసాద్‌సీటీఎం(ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌) విజయ పుష్ఫతో పాటు ఆర్‌ఎంలుడీఎంలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.