వైభవంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తలైన తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా వేద పండితులు ధ్వజారోహణ
కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు మార్చి 1వ తేదీన ఆలయానికి విచ్చేస్తున్న సందర్భంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ములమూర్తులకు బంగారు కిరీటాలు చేయిస్తున్న నేపథ్యంలో పలువురు భక్తులు బంగారాన్ని, బంగారం కొనేందుకు నగదును విరాళంగా అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.