మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన భారత రాష్ట్ర సమితి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మనీష్ సిసోడియా అరెస్టును బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఖండించారు. మనీష్ సిసోడియా అరెస్టు ఆప్రజాస్వామికం… బిజెపి పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను బిజెపి చేస్తుంది ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్ అన్నారు. బిజెపి ప్రతిపక్షాలపై చేస్తున్న రాజకీయ కుట్రలు దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి బిజెపి కక్ష సాధింపు రాజకీయాల కు మనీష్ సిసోడియాను అరెస్ట్ పారాకాష్టకు చేరిందన్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారు. బిజెపి అసమర్థ విధానాలను అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను నాయకులను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తుంది. అన్నారు.

బిజెపి తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్షాల నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించి కుటిల ప్రయత్నాలను చేస్తుందని, బిజెపి నీతిలేని దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తుందని, బిజెపి కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారు. భవిష్యత్తులో బిజెపి నాయకులకు ఇదే గతి పడుతుంది అన్నారు. ప్రజాబలం లేక దొడ్డిదారిన రాజకీయాలు చేయడం, అధికారంలోకి రావడం బిజెపికి అలవాటుగా మారింది ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బిజెపి తన ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన పార్టీలను దెబ్బతీసే కుట్రలను బిజెపి చేస్తుందని, తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసి బిజెపి భంగపడింది. బిజెపి కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారు బిజెపి అప్రజాస్వామిక దుర్మార్గపూరిత కుట్రలకి కాలం దగ్గర పడింది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.