ఎన్నికల ప్రచారానికికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి మునుగోడు ఎన్నికల  ప్రచారానికి దూరంగా ఉండనున్నట్లుగా తేల్చారు. తన సోదరుడు బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని ప్రకటించిన మరుక్షణం నుంచి మునుగోడు బైపోల్‌ విషయంలో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సరిగ్గా నామినేషన్లు చివరి గడువు తర్వాత రోజు అంటే అక్టోబర్ 15వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి వస్తారని ఇప్పటి వరకు కాస్తో, కూస్తో ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ఆశలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విదేశీపర్యటన నీళ్లు చల్లినట్లైంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం ఈనెల 14వ తేది వరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించిన తర్వాత ఈ వార్త వెలువడటం విశేషం.

Leave A Reply

Your email address will not be published.