వైద్య విద్యార్థుల మృతిపై చంద్రబాబు నాయిడు దిగ్బ్రాంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కుప్పంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థుల మృతిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయిడుదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో శెట్టిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ముగ్గురు చిన్న వయసులోనే ఇలా ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు. వారి కుటుంబాలకు చంద్రబాబు తన సంతాపం తెలియజేశారు.ఆదివారం తెల్లవారుజామున కుప్పం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడుపల్లి మండలంలోని చిన్నశెట్టిపల్లిలో అతి వేగంగా దూసుకువచ్చిన లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో వైద్య విద్యార్థులు కుప్పంకి వస్తున్న సమయంలో కారును లారీ ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. దీంతో లారీ చక్రాల కింద పడటంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతులు వికాస్, కల్యాణ్, ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.