పరకాల పోరాటాల గడ్డపై దళారులు దండుపాళ్యం ముఠా కట్టి దోచుకుంటున్నాయి.

- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పరకాల నియోజకవర్గం పోరాటాల గడ్డ, పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఈ గడ్డది. అలాంటి ఈ గడ్డపై దళారులు, దండుపాళ్యం ముఠా కట్టి దోచుకుంటున్నాయని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యే పేరులోనే ధర్మం ఉంది.. కానీ ఆయన బుద్దిలో లేదు ఈ ఎమ్మెల్యే దందాల రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ మొత్తం కాంట్రాక్టులు ధర్మా రెడ్డివే ఏ దోపిడీలో చూసినా ధర్మా రెడ్డి పేరే వినిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వలే, దళితులకు మూడెకరాలు ఇవ్వలే అన్నారు. ఈ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేం లేదు మరి 23లక్షల కోట్లు ఎవరింటికి పోయినయ్ పరకాల అభివృద్ధి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందే.. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు  సంక్షేమ ఫలాలు అందాయి. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ చెబుతున్న పరిస్థితి కాంగ్రెస్ ఏం చేసిందని డ్రామారావు అడుగుతున్నాడన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో వరంగల్ ఏకశిల పార్కు దగ్గర చర్చ పెడదాం. నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా. మీరు చెప్పింది తప్పైతే ప్రజలకు క్షమాపణ చెబుతారా? నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా. ప్రతీ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ కట్టినవే సిద్దిపేట చింతమడకలో గుడి, బడి నీళ్ల ట్యాంక్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే హైటెక్ సిటీ, శిల్పారామం, మెట్రో రైల్, దేశంలో రైల్వే స్టేషన్లు మేం కట్టినం అన్నారు. పేపరు మిల్లులు మేం కడితే మీ అయ్య వచ్చి వాటిని మూతపడేశారు. మీరు ఫామ్ హౌసులు కట్టుకున్నారు.. వేలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు తప్ప పేదలకు చేసిందేం లేదు. నిజంగానే 4కోట్ల తెలంగాణ ప్రజలు నీ కుటుంబమే అయితే 10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్ కు పేదలను ఎందుకు రానివ్వడం లేదు? 12వందల మంది అమరవీరుల కుటుంబాలలో ఏ ఒక్కరికైనా ఇంటికి పిలిచి బుక్కెడు బువ్వ పెట్టారా అని ప్రశ్నించారు. నిజంగా తెలంగాణ ప్రజలు మీ కుటుంబమే అయితే ..పీజీ విద్యార్థి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు  రామర్శించలేదు? అయిదు రోజులైనా నేరస్తులను పట్టుకుని ఎందుకు శిక్షించలేదు? నీ ఇంట్లో బిడ్డను ఎవరైనా చంపితే ఇలాగే చేస్తారా? ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా చూడటానికి రాని మీకు ఎలా మేం కుటుంబ సభ్యులం అవుతాం? అయినా నువ్ మా కుటుంబం అనుకుంటే.. పరకాల సాక్షిగా మా తెలంగాణ కుటుంబం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం అన్నారు. మా తెలంగాణ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు తెలంగాణ తెచ్చామని చెప్పుకున్నవారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సోనియా కలలుగన్న తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ గెలవాలి. పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని ప్రతీ పేదకు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తాం. గత ఏడాది వడగండ్ల వానకు 300 కోట్ల పంట నష్టం జరిగింది. వచ్చి చూసి వెళ్లిన మంత్రులు ఇప్పటివరకు పరిహారం అందించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రైతులకు పంట నష్టం చెల్లించే బాధ్యత మేం తీసుకుంటాం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.