కొత్త కోడళ్లు ఏ వైపుకో?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన కోడళ్ళు ఏ పార్టీకి మద్దతిస్తారో అన్న సందేహం సార్వత్రా వ్యక్తమౌతుంది. మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా 23వేల మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోగా వీరిలో  అత్యధిక మంది కొత్త కోడళ్లే ఉన్నారు. అయితే ఓటు హక్కు పొందే కోడళ్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులే ఉండటంతో తమకే అనుకూలమని అధికార టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుండగా వీరిని మచ్చిక చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తాయో వేచి చూడవలసిందే.

 

Leave A Reply

Your email address will not be published.