తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర (Gas Cylinder price) పెంచడాన్ని నిరసిస్తూ ఘట్కేసర్లో బీఆర్ఎస్ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో (Minister Malla reddy) కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత యూపీఏ (UPA) హయాంలో గ్యాస్పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు. గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకంలో రూ.30 వేల కోట్లు కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఎం కిసాన్ యోజనలో భారీగా లబ్ధిదారులను తగ్గించారని వెల్లడించారు. సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నదని చెప్పారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు పెంచడం ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే గ్యాస్పై 10 పైసలు తగ్గిస్తారని, అవి పూర్తవగానే రూ.100 పెంచుతారని దుయ్యబట్టారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post