ఇబ్రాహీంపేట్ లో సామూహిక హనుమాన్ చాలీసా మహోత్సవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద శుక్రవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆదేశాల మేరకు గ్రామాల వారిగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపేట్ హనుమాన్ ఆలయం వద్ద నలభై మంది స్వాములతో 11 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. గ్రామ సర్పంచ్ దేవారం నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దిగంబర పంతులు, శ్రీ హనుమాన్ దీక్ష మాలా ధారణ గురు స్వాములు అంబిలి పూర్ రాజు, గోక న్ శంకర్ గౌడ్ (ఆర్టీసీ),తులసి రామ్ మారుతి (ఆర్టీసీ),గజ్జల ధనుంజయ్, ఒంటేరి కొండలరావు( మేస్త్రి), స్వాములు మాసాని మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్, ప్రశాంత్, పడిగెల శ్రీనివాస్ గుప్తా ,తో పాటు మాజీ స్వాములు బండి పండరి యాదవ్, ఉద్దెర రాజ్ కుమార్, ఆత్కూరు సంతోష్, గడి గెల కామేశ్వర్, హౌసుల ప్రవీణ్, చిన్న లింగం, తోపాటు మాత స్వాములు, గ్రామస్తులు, యువకులు, తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.