మానేపూర్ లో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బిచ్కుంద: బిచ్కుంద మండలంలోని మానేపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దాసరి రాములు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఆయననే కంటి పరీక్షలు చేసుకున్నానంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉద్యమంల కొనసాగిస్తుందని కావున గ్రామంలోని ప్రతి ఒక్కరు కంటి వెలుగులో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.