రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్గా తారిఖ్ అన్సారీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన నియామక పత్రాన్నినేడు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తారిఖ్ అన్సారీ అందుకున్నారు.