వేములవాడ రాజన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డికి పేద పండితులు ఆశీర్వాదాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి వెంట స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.