ధరణి’’ ప్రజల పాలిటి గుదిబండ

- అర్ధరాత్రి పోర్టల్ ను ఓపెన్ చేసి అనుకూలంగా మార్చుకుంటున్న అధికార పార్టీ నేతలు - డబుల్ బెడ్రూం ఇండ్లపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి - అన్ని ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేసీఆర్ గ్యాస్ పై ధర్నా చేయడం సిగ్గు చేటు - మద్యం ద్వారా ఏటా రూ.40 వేలు దోచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం - వారసత్వంగా లిక్కర్ దందా చేస్తున్న కేసీఆర్ బిడ్డ - లిక్కర్ స్కాంలో ఎవరున్నా కేంద్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు - బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు - తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పర్యటించిన బండి సంజయ్ - పార్టీ నేత గౌతమ్ రావు కుటుంబానికి పరామర్శ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రజలకు ‘‘ధరణి’’ పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారుల అండదండతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేయించుకుని ప్రభుత్వ, పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.

ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు, తదితరులతో కలిసి ఇటీవల మాత్రు వియోగంతో బాధపడుతున్న పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు గౌతమ్ రావును పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

• తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందుకు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరసిస్తూ రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నేను దీక్ష చేయబోతున్నా.

• నేను ఏ జిల్లాకు వెళ్లినా పేదలు ఇండ్లు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇయ్యలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా స్పందించలేదు.

• ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డుబల్ బెడ్రూం ఇండ్ల విషయంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మంది లబ్దిదారులకు ఇండ్లు ఇఛ్చారు? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు మంజూరు చేసింది? అనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

• రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడా కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు గ్రుహ ప్రవేశం చేయకముందే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎక్కడ చూసినా పగుళ్లు కన్పిస్తున్నాయి. పేదలకు ఒక్క ఇల్లు ఇయ్యని కేసీఆర్ తాను మాత్రం 100 రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నడు.

• రుణమాఫీ అమలు కాక రైతులు అల్లాడుతున్నరు. రైతుల ఉసురు పోసుకుంటున్నడు. ఈ జిల్లాలో ఐకేపీ సెంటర్లలో పెద్ద కుంభ కోణం జరుగుతున్నా చర్యల్లేవు. రూ.20 కోట్ల కుంభ కోణం బయటపడింది. పండించిన ప్రతి గింజ మేమే కొంటామని చెప్పిన కేసీఆర్ ఫ్రభుత్వం … మాట తప్పింది. పండించిన ప్రతి గింజకు పైసలిస్తోంది కేంద్రమే.

• జిల్లాలో అతిపెద్ద సమస్య ధరణి. అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేసి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నరు. పేదల భూముల వారి పేర్లపై ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. రుణాలు రావడం లేదు. ధరణి తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది.

• దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నయి తెలంగాణలోనే. 9 సార్లు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నల్లా ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిస్తున్నడు. సిగ్గు లేకుండా గ్యాస్ ధరల పెంపుపై ధర్నాలు చేస్తున్నరు. మద్యం ధరలను కూడా భారీగా పెంచి ఏటా రూ.40 వేల కోట్లు దోచుకుంటున్నడు.

• కేసీఆర్ బిడ్డ కుల వ్రుత్తుల మాదిరిగా లిక్కర్ దందా చేస్తోంది. ఇవన్న ప్రశ్నిస్తే కొత్త కుట్రలకు తెరదీస్తున్నారు. మోదీ ప్రభుత్వం లిక్కర్ దందాలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని బండిసంజయ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.