బాన్సువాడ నుండి భద్రాచలం కు బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిఎంకు వినతి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: బాన్సువాడ నుండి భద్రాచలం పుణ్యక్షేత్రానికి బస్సు సర్వీసును ప్రారంభించాలని కోరుతూ సోమవారం శ్రీ హనుమాన్ దీక్ష సేవాసమితి బాన్సువాడ ప్రతినిధులు బాన్సువాడ ఆర్టీసీ డిఎం సదాశివకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత పై అధికారులకు విషయాన్ని తెలిపి ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ దీక్ష సేవాసమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి నసురుల్లాబాద్ సాయ గౌడ్, అంబిలిపూర్ రాజు, పాలకుర్తి దత్తు గురుస్వాములు, బాన్సువాడ మండల అధ్యక్షుడు గాండ్ల తేలి ఉమా మహేష్ కుమార్, ప్రతినిధులు గోకాన్ శంకర్ గౌడ్, తులసి రామ్ మారుతి, పడిగెల శ్రీనివాస్, ప్రశాంత్, ఒంటెరి కొండలరావు యాదవ్, లక్ష్మణ్, గజ్జల ధనుంజయ్, తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.