ఇరాన్ పడవలో 425 కోట్ల డ్రగ్స్ పట్టివేత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అరేబియా సముద్రంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. దేశంలోకి డ్రగ్స్ను తరలించేందుకు ప్రయత్నించిన ఓ ఇరాన్ పడవను భారత కోస్టు గార్డు (ఐసీజీ) సిబ్బంది అడ్డుకున్నారు. బోటులో తరలిస్తున్న 425కోట్ల విలువగల 61 కేజీల హెరాయిన్ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత 18 నెలల్లో 2,355 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది