లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కవిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నిజామాబాద్: ఎమ్మెల్సీ కవిత నందిపేట మండలం చౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత దంపతులు స్వామివారికి అభిషేకము కుంకుమార్చన నిర్వహించారు. గ్రామస్తులు ఎమ్మెల్సీ కవితతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.  అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, మేయర్ నీతు కిరణ్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.