29వరోజుకు చేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణ జ్యోతి/ న్యూస్/నిజామాబాద్: ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఉదయం 10గంటలకు కొత్త కలెక్టరేట్ సమీపంలో గిరిరాజ్ కాలనీ రోడ్డులోని రాజీవ్ స్వగృహ భవనాల సందర్శన అనంతరం మధ్యాహ్నం గంటలకు నిజామాబాద్ పాదయాత్ర క్యాంపులో భోజన విరామం.

సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్ దుబ్బ చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభం, అమల్ వాడి, సతీష్ పవార్ చౌరస్తా, శివాజీ చౌక్, భగత్ సింగ్ చౌరస్తా, గోల్ హనుమన్ చౌరస్తా, పెద్ద బజార్ చౌరస్తా, అజ్ హమ్ రోడ్ మీదుగా నెహ్రూ పార్కు వరకు చేరుకోనున్న యాత్ర. రాత్రి 7 గంటలకు నిజామాబాద్ నెహ్రూ పార్కు వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి 9గంటలకు బోదన్ నియోజకవర్గం ఎడపల్లి మండలంలోని సటాపూర్ లో రాత్రి బస చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.