సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో చెన్నూరు దశ దిశ మార్చారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్ రావు  శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ. 60 ఏళ్లలో కానీ పనులను నాలుగేళ్లలో బాల్క సుమన్ చేసి చూపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో చెన్నూరు దశ దిశ మార్చారు. అద్భుతంగా తీర్చి దిద్దారని, దళిత బంధు విజయవంతంగా అమలు చేస్తున్నాం. త్వరలో ఇల్లు జాగ ఉంటే, 3 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తాం అన్నారు. సుమన్ కోరిక మేరకు, సీఎం కేసీఆర్ కి తెలియజేసి జైపూర్ పవర్ ప్లాంట్ లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తామని హరీష్ రావు  వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.