శిశువుకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని దోమకొండకు చెందిన 14ఏళ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చింది. బాలిక తల్లి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు, అతడే బాలికను కూడా గర్భిణీని చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో బాలికను ఆస్పత్రిలో చేరిపించడంతో శిశువుకు జన్మనిచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.