కూడిన బస్సు చక్రం .. తప్పిన ప్రమాదం

;తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కరీంనగర్‌ – వరంగల్‌ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్‌ నుంచి హనుమకొండకు వెళ్తుండగా.. ఎల్కతుర్తి శివారులో ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంటపొలంలోకి బస్సు చక్రాలు దూసుకెళ్లాయి. ఈఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నిలువరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్‌లోడ్‌ వల్లే బస్సు చక్రాలు ఊడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులు 80 మంది ఉండగా, పలువురికి స్వల్పగాయాలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.