ఐదు నెలల పసికందును కడతేర్చిన కసాయి తల్లి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఐదు నెలల పసికందును బావిలో పడేసి కడతేర్చిన అమానవీయ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది ..
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కోస్గి పట్టణ కేంద్రంలోని హరిజనవాడలో గోవిందు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండగా అందులో మొదటి భార్యకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. పుట్టుకతోనే మూగ అయిన రెండో భార్య ఆశమ్మ గత ఐదు నెలల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా నిన్న రాత్రి మూడు గంటల సమయంలో పసిబిడ్డను బావిలో పడేసి చంపేసింది .ఉదయం కుటుంబ సభ్యులు పసిబిడ్డ కోసం వెతకగా పోలీసులు ఆశమ్మను పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టారు. మూగ సైగలతో పోలీసులకు బావిలో పసిబిడ్డను పడేసినట్లు తెలపడంతో సంఘటన స్థలానికి మహిళను తీసుకువచ్చి విచారించగా బావిని చూపించింది. స్థానికుల సహాయంతో పోలీసులు పసిబిడ్డ మృతదేహాన్ని బావిలో నుండి వెలికితీసి ,మహిళను అదుపులోకి తీసుకున్నారు..