నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా కనిపించనున్న తోకచుక్క

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: 2024 అక్టోబర్ లో కనిపించనున్న సీ/2023ఏ3 తోకచుక్క గంటకు 1,80,610 మైళ్ల వేగంతో భూమి దిశగా ప్రయాణం 80 ఏళ్ల తర్వాత మరోసారి సుందర దృశ్యం ఆవిష్కృతం కానుంది.

ఇటీవలే గుర్తించిన ఓ తోకచుక్క వినీలాకాశంలో ఎంతో ప్రకాశవంతంగా కనిపించనుంది. ఇది భూమికి సమీపం నుంచి వెళ్లనుంది. సీ/2023ఏ3 పేరుతో పిలుస్తున్న ఈ తోకచుక్క గంటకు 1,80,610 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకువస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఈ తోకచుక్క చివరిగా 80 వేల ఏళ్ల క్రితం భూమికి సమీపం నుంచి వెళ్లింది. తిరిగి 2024 అక్టోబర్ నెలలో కనిపించనుంది. కంటితో నేరుగా ఈ తోకచుక్కను వీక్షించొచ్చు. గత నెలలో భూమికి సమీపం నుంచి జెడ్ టీఎఫ్ గ్రీన్ తోకచుక్క కూడా వెళ్లింది. దీని మాదిరే సీ/2023ఏ3 తోకచుక్క కనిపించనుంది. సాధారణ నక్షత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ప్రకాశంతో ఇవి ఉంటాయి. వీనస్ మాదిరి (శుక్రుడు) ప్రకాశవంతంగా ఇది ఉంటుందని అంచనా.

జెడ్ టీఎఫ్ తోకచుక్క ప్లస్ 4.6 మాగ్నిట్యూడ్ వెలుగుతో ఉంటే, దీనికంటే సీ/2023ఏ3 తోకచుక్క 100 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే ఇవన్నీ అంచనాలేనని, భూమిని సమీపించే కొద్దీ ఈ తోకచుక్క ఎన్నో మార్పులకు గురికావచ్చని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.