ఫార్మా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

నలుగురి సజీవ దహనం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ ఎంఐడీసీ వద్ద బ్లూ జెట్ హెల్త్‌కేర్‌ అనే ఫార్మా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. అయితే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీబీఐ అధికారిగా నమ్మించి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 20 లక్షలు డిమాండ్.. చివరికి అయితే మంటలు భారీగా ఉండటంతో వాటిని అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే శనివారం ఉదయం 4 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఏడుగురికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని హాస్పిటల్స్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. : ఢిల్లీలో భూప్రకంపనల వేళ నిపుణుల హెచ్చరిక.. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల మొదలయ్యాయని అధికారులు ప్రాథమికంగా అంఛనా వేశారు. తరువాత మంటలు కెమికల్స్ ఉన్న బ్యారెల్స్ వద్దకు వ్యాపించడంలో అవి పేలినట్టు తెలుస్తోంది. అయితే మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.