టిటిడి అడ్వైజరీ వైస్ చైర్మన్ గా మెట్టు రాఘవేంద్ర రావు కు ఘన సన్మానం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ వైస్ చైర్మన్ గా మెట్టు రాఘవేంద్ర ను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నియమించారు. అట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ నగరానికి వచ్చిన మెట్టు రాఘవేంద్ర ను జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్, పెంటం రాజేష్, గౌట్ గణేష్ ,రజనీష్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ మరియు శాలువాతో సత్కరించారు. పెద్దలు మెట్టు ప్రసాద్ మెట్టు విజయకుమార్, డాక్టర్ మెట్టు శ్రీకాంత్, రజనీకాంత్, వినయ్ లు ఘనంగా సన్మానించారు.