తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.3 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీరు దుబారు నుంచి బంగారం తరలిస్తున్నట్లు తెలిపారు.