ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రామగుండంలోని ఎన్టీపీసీ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్న బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లను బండి సంజయ్, భగవంత్ ఖుబాతోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లు పరిశీలించిన అనంతరం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్ సీఎల్) ను  సందర్శించనున్నారు. అనంతరం గోదావరిఖనిలోని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ నివాసానికి  వెళ్లి మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఎస్.కుమార్ నివాసంలో ప్రధాని రామగుండం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడనున్నారు.

Leave A Reply

Your email address will not be published.