భద్రాచలం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక జారీ

-    నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. అత్యధిక వర్షపాతం నమోదు వలన  ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ , వరంగల్ , ఖమ్మం జిల్లాలలో నీటి ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం పెరుగుతుందని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో 19 టెరిటోరియల్ ప్రాంతాలలో చీఫ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఆపరేషన్ బృందాలు పని చేస్తున్నాయని ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నాయని ఆయన తెలిపారు. కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో ఉంది. ఈ రోజు ఉదయం తో పోలిస్తే ఇన్ ప్లో  తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వద్ద నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర మంత్రివర్యులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు.భద్రాచలం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని, భద్రాచలం పట్టణంలో వరద నీటి ప్రవాహం కట్టడి చేయడానికి భారీ మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణానష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రెండు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచామని. పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని సంబంధిత ప్రాజెక్టు అధికారులతో నిరంతరం మన రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువులు వర్షపాతంతో జలకళతో నిండి ఉన్నాయని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ పేర్కొన్నారు. కేవలం 100 లోపు చెరువులకు మాత్రమే గండ్లు పడ్డాయి వాటిని పూడ్చుతున్నామని స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.