ఇద్దరు పిల్లలను విడిచి రెండో పెళ్లి చేసుకున్న భర్త

బైకు పై వెళ్తుండగా చాకుతో వెనుక నుంచి భర్త గొంతు కోసిన భార్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తనను,  ఇద్దరు పిల్లలను విడిచి రెండో పెళ్లి చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్న భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళ ఉదంతం నెల్లూరు రూరల్‌ మండలంలో చోటుచేసుకుంది. లక్ష్మీప్రసన్న అనే మహిళకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె వీరిని వదిలేసి మండలంలోని సౌత్‌ మోపుర్‌ గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ ను ప్రేమించి మరో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు చోటు చేసుకుంటున్నాయి.తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ ఆమె భర్తపై కక్ష పెంచుకుంది. ఇద్దరు కలిసి నెల్లూరు నుంచి బైక్పై సౌత్ మోపూరుకు వెళ్తుండగా మొగళ్లపాళెం స్టేడియం సమీపంలో చాకుతో వెనుక నుంచి భర్త గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయింది. కిందపడ్డ బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రూరల్ పోలీసులు లక్ష్మీ ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.