తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అబిడ్స్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రూప్ బజార్లో ఓ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. 2 ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. ఈ సంఘటనతో పరిసర దుకాణ దారులు భయాందోళనకు గురయ్యారు.