సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది జవాన్లు దుర్మరణం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/న్యూస్ డెస్క్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి.స్థానిక పోలీసులతో కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు చాటేన్ నుంచి తంగూకు వెళ్తుండగా జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందాలు గాయపడ్డ జవాన్లను, మృతదేహాలను బస్సు నుంచి వెలికి తీస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటవెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు, 13 మంది సైనికులు ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.