రాంగ్ రూట్ లో వెళ్లే వారికి హెచ్చరిక

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్‌లో చాలా మంది రాంగ్‌రూట్ ప్రయాణాలు చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు తమను చూడట్లేదని భావనతో దూసుకెళ్తుంటారు. ఇలా వెళ్లి ప్రమాదాల బారిన పడటమే కాకుండా.. రైట్ రూట్‌లో వచ్చేవారిని యాక్సిడెంట్లకు గురి చేస్తున్నారు. దీంతో రాంగ్ రూట్ ప్రయాణాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇక నుంచి రాంగ్‌ రూట్ ప్రయాణాలు కుదరవు. నిఘా నేత్రాలు మీపై ఓ కన్నేస్తాయి.సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 124 ప్రాంతాల్లో ఎక్కువగా రాంగ్‌రూట్‌ ప్రయాణాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. అటువంటి చోట్ల ఆటో మేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ANPR ) కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా రాంగ్‌ రూట్‌లో ప్రయాణాలు సాగిస్తే నంబరు ప్లేటును కెమెరా గుర్తించి ఫోటో తీస్తుంది. అనంతరం వెహికల్ ఓనర్లకు ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ ఫైన్ పంపిస్తుంది. ఈ కెమెరాలను రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.ఇటీవల కాలంలో రాంగ్‌రూట్ ప్రయాణాల ద్వారా ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి ఈ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.