మామతో కలిసి భర్తను కడతేర్చిన మహిళ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఓ మహిళ మామతో కలిసి తన భర్తనే దారుణంగా హతమార్చింది. ఏమీ ఎరగనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు సదరు భార్యే నిందితురాలిగా తేల్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో రాములు అనే వ్యక్తిని భార్య మంజుల, మామ నారాయణ ఈ నెల 9న నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. అయితే, దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే మృతదేహాన్ని పాతిపెట్టారు. స్థానికులు నిలదీయడంతో వారు విషయం బయటకు చెప్పారు. స్థానిక బాన్సువాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు తెలుసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.