కారు ఢీకొని యువకుని మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ఘటన స్థలంలోనే మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలానికి చెందిన ఏర్ల ఉదయ్ కుమార్ (19) అనే యువకుడు నిజామాబాద్ జిల్లా లోని మోస్రా గ్రామంలో గల తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో శ్రీనగర్ గ్రామా శివారు రాగానే ఎదురుగా వస్తున్న కారు డీకొనగా ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.